మేము భగత్ సింగ్ వారసులం.. మమ్మల్ని ఏం చేయలేరు – ఢిల్లీ డిప్యూటీ సీఎం

-

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని బిజెపి టార్గెట్ చేస్తుందని అన్నారు. మేం భగత్ సింగ్ వారసులమని.. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని అన్నారు మనిష్ సిసోడియా. కేజ్రీవాల్ సర్కారులో మంత్రిని కాబట్టే నాపై సిబిఐ దాడులు చేయిస్తున్నారని వండిపడ్డారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని అన్నారు మనీష్. కేజ్రీవాల్ కు పెరుగుతున్న మద్దతును జీర్ణించుకోలేక ఆయనను నిలువరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

కేజ్రీవాల్ పేదల కోసం పనిచేస్తారని.. మోడీ కరోడ్ పతీల కోసం పనిచేస్తారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు మోడీకి శోభ తీసుకురావన్నారు మనిష్ సిసోడియా. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న తన నివాసంలో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారని.. సచివాలయ కార్యాలయంలో కూడా సోదాలు చేశారని తెలిపారు. దేశంలోనే బెస్ట్ ఎక్సైజ్ పాలసీ ఢిల్లీ సర్కార్ పాలసీ అని అన్నారు మనీష్. పూర్తి పారదర్శకంగా ఈ పాలసీని రూపొందించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version