ప్రశాంత్ నీల్ ఎందుకు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేశారబ్బా..!!

-

ఈ సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును వున్న కత్తిలా తయారైంది. చాలా మంది దీనిని ఉపయోగించి కొత్త కెరియర్ స్టార్ట్ చేసి ఉన్నత స్థానంలో నిలిచారు. ఒకప్పుడు సామాన్య ప్రజలకు తన మనసులోని భావనను చెప్పుకోవడానికి సరైన వేదిక ఉండేది కాదు. టీవి ఛానెల్ లు, పేపర్స్ బడా బాబుల చేతుల్లో ఉండేవి. దీనితో సామాన్య జనం దిక్కు తోచని స్థితిలో ఉండేవారు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత మాత్రమే వారి గొంతుకు న్యాయం జరిగింది.

ఇక సినిమా స్టార్స్ కు ఈ సోషల్ మీడియా ఆదాయం పొందే మార్గం గా మారింది. అలాగే వాళ్ల మూవీ విశేషాలు కూడా అందరికీ ఫ్రీ గా చెప్పే అవకాశం లభించింది.రామ్ గోపాల్ వర్మ వంటి కొందరు సెలెబ్రిటీలు వారికి ఇష్టం వచ్చినట్టు , నచ్చినట్లు వాడుకుంటూ వుంటారు. కొంత మంది మాత్రం ఈ సోషల్ మీడియా కు దూరంగా ఉండి యోగుల లాగా ఉండాలని కోరుకుంటారు.

ప్రస్తుతం కెజీఎఫ్ చిత్రాలతో దేశంలో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తాజాగా తన ట్విట్టర్ ఎక్కౌంట్ ని క్లోజ్ చేసేసారు.అయితే ప్రశాంత్ నీల్ ఇలాంటి నిర్ణయం ఇంత అకస్మాత్తుగా ఎందుకు తీసుకున్నారో ఎవరికి అర్దం కాలేదు. ఆయన ఎక్కౌంట్ ద్వారా సలార్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి టైమ్ లో అకౌంట్ క్లోజ్ చేయడం తో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version