బ్రహ్మాస్త్ర రెండు రోజులకి రికార్డు గ్రాస్ వసూళ్లు.. ఎంతంటే?

-

బాలీవుడ్​ స్టార్​ నటీనటులు రణ్​బీర్​ కపూర్​, ఆలియా భాట్​ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త’. భారీ అంచనాల మధ్య పాన్​​ ఇండియా చిత్రంగా ప్రపంచ దేశాల్లో విడుదలైంది. అయితే తొలిరోజు మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాన్​ హాలిడే రోజు ఈ మూవీ విడుదలైనప్పటికీ భారీ వసూళ్లు సాధించడం పట్ల చిత్ర యూనిట్​ హర్షం వ్యక్తం చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8913 స్క్రీన్లల్లో విడుదలైన ఈ మూవీ రెండో రోజు దాదాపు రూ.85 కోట్ల మేర వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్​ రూ.160 కోట్లకు చేరిందని తెలిపింది. హిందీతో పాటు అన్ని భాషల్లో సినిమాకు చక్కటి కలెక్షన్స్ వస్తున్నాయని పేర్కొంది. 2డీ వెర్షన్ తో పాటు త్రీడీకి కూడా చక్కటి ఆదరణ లభిస్తుందని వెల్లడించింది.

అయితే ఈ సినిమాపై పెట్టుబడులు పెట్టిన పీవీఆర్​, ఐనాక్స్​ సంస్థలకు భారీ నష్టం వాటిల్లిందని నెట్టింట తెగ వార్తలు వచ్చాయి. బ్రహ్మాస్త్ర సినిమా వల్ల ఈ రెండు సంస్థలు రూ.800 కోట్లు నష్టపోయాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే దీనిపై మేకర్స్ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా పీవీఆర్​ సీఈవో కమల్​ ఆ వార్తలపై స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. తామేమి నష్టపోలేదని, మంచి కలెక్షన్లు వస్తున్నాయని చెప్పారు.

కాగా, ఈ చిత్రంలో టాలీవుడ్​ స్టార్​ హీరో అక్కినేని నాగార్జున , బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, హీరోయిన్​ మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. క‌ర‌ణ్ జోహార్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ హంగులతో రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కించారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version