కరోనా బారిన పడ్డ భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్..

-

కరోనా ఉధృతి రోజు రోజుకీ తీవ్రతరం అవుతోంది. వారు వీరు అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తూ దాని పరిధి పెంచుకుంతూ వెళ్తుంది. ఇప్పటికే దేశంలో కేసులు చాలా పెరిగాయి. రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ కరోనా బారిన పడ్డారు. 26ఏళ్ళ ఈ రెజ్లర్ తనకి కరోనా సోకిందని మీడియాకి తెలియజేసింది.

వినేష్ ఫోగాట్ ఇటీవలే క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్నకి ఎంపికయ్యారు. ఆ పురస్కారాల ప్రధానోత్సవానికి హాజరు కాకముందే కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇంట్లోనే ఉండిపోయింది. ప్రస్తుతం తనకి బాగానే ఉందని, దేవుడి దయవల్ల తాను కోలుకుంటానని, కరోనాని జయించి మళ్ళీ అందరి ముందుకు వస్తానని తెలియజేసింది. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version