దేవుడి దగ్గర కేసీఆర్ నీచపు రాజకీయం చేయడం బాధాకరం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

యాదాద్రి పున: ప్రారంభం రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈరోజు కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని పున:ప్రారంభించారు. అంగరంగ వైభవంగా నూతనంగా నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రారంభానికి సతీసమేతంగా కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

అయితే ఇప్పుడు యాదాద్రి పున: ప్రారంభానికి కేసీఆర్ ప్రోలోకాల్ పాటించలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. స్థానిక ఎంపీగా ఉన్న నన్ను కూడా పిలవలేదని.. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలను మాత్రమే ఆహ్వనించారని విమర్శించారు. దేవుడి దగ్గర కేసీఆర్ నీచపు రాజకీయాలు చేయడం బాధకరం అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version