చంద్రబాబు దీక్షపై వైసీపీ కౌంటర్‌..జన్మలో మీకు అధికారం రాదు !

-

టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న సాధన దీక్షపై వైసీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సాధన దీక్ష పేరుతో దీక్షలు చేస్తున్నారని.. మీరు ఏం సాధించాలని దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. జన్మలో ఇక టీడీపీకి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పాలన చేస్తున్నారని… ఎక్కడ అవినీతికి తావు లేదన్నారు. మట్టి, ఇసుక అమ్మటం, అవినీతికి పాల్పడటం లాంటివి చేస్తే సహించబోమని.. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు చెప్పారని తెలిపారు. వైసీపీ వ్యతిరేక పార్టీలు చెప్పే మాటలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.

అనంతరం ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ…వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిందని.. ముఖ్యమంత్రి జగన్‌ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. విద్యారంగంపై ఇన్ని నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న నాడు నేడు పరిశీలించమని అధికారులను పంపారని తెలిపారు. నాడు-నేడు కార్యక్రమం కోసం 11 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. పరీక్షలు రద్దు చేయమన్న నీచ సంస్కృతి తెలుగుదేశం పార్టీది అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version