టోల్ ప్లాజా వద్ద వైసీపీ నేత హల్చల్..సిబ్బంది పై దాడి

-

గుంటూరు కాజా టోల్ ప్లాజా వద్ద అధికారపార్టీకి చెందిన వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతి హంగామా సృష్టించింది. కాజా టోల్ గేట్ వద్ద సిబ్బంది పై దాడి చేసింది. టోల్ ఫీజ్ కట్టకుండా వెళ్తున్న రేవతి కారుకు బారికేడ్లు అడ్డు పెట్టారు టోల్ గేట్ సిబ్బంది. దీంతో  ఆగ్రహం తో కారు దిగి హాల్ చల్ చేసిన రేవతి, తన కారు ఆపుతారా అంటూ సిబ్బంది పై దాడి చేసింది.

ఆ బారికేట్లను తోసేసిన రేవతి హల్చల్ సృష్టించింది. రేవతి హడవుడితో టోల్ గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. తోటి వాహన దారులు ఆశ్టర్యపోయారు. అధినేత వల్ల కాదు ఇలాంటి వారి వల్లే అధికారంలో ఉన్న  అందరికీ చెడ్డ పేరు  వస్తుందని కొందరు చర్చించుకోవడం గమనార్హం. కారణమేదైనా…ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version