కేంద్ర రక్షణ శాఖను కూడా వదలని వైసీపీ నేతలు

-

వైసీపీ నేతలకు సంబంధించి ఏదోక వార్త ఈ మధ్య మనం ఎక్కువగా వివాదాల్లో చూస్తున్నాం. రాజకీయంగా బలం ఉన్న తరుణంలో కొందరు నేతలు అక్రమాలకూ యధేచ్చగా పాల్పడుతున్నారు. ఏదోక నేరంలో వైసీపీ నేతల హస్తం ఉంటుంది. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు ఏకంగా రక్షణ శాఖ భూములను కూడా టార్గెట్ చేసారు. దేశ రక్షణశాఖ అనుబంధ మిథానీ సంస్ధకి చెందిన భూముల్లో అక్రమ గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టారు.

దీనితో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు మిధానీ సంస్థ అధికారులు. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అక్రమాలని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పారిశ్రామిక వేత్తలు కూడా ఈ పరిణామంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిధానీ వంటి సంస్థల భూములకే రక్షణ లేకుంటే, ఇతర పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version