అమరావతి పాదయాత్రను పూర్తిగా టీడీపీ యాత్రగా చేశారు : వైసీపీ ఎమ్మెల్యే

-

అమరావతి పాదయాత్రను పూర్తిగా టీడీపీ యాత్రగా చేశారని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు ఆరోపించారు. దానిని తన రాజకీయంగా మార్చుకుని కుట్రలోభాగంగా పసుపుమయం చేశారని అన్నారు. అందులో భాగంగా ఆయా నియోజకవర్గ టీడీపీ నాయకులు ఇన్వాల్వు అవుతున్నారని సుధాక‌ర్ బాబు ఆరోపించారు. పాదయాత్రకు టీడీపీ జనాలను భారీ ఎత్తున సేకరిస్తోందన్నారు. పోలీసులు రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదు…కాని టీడీపీ మంది మార్భలాన్ని మాత్రమే అడ్డుకున్నారని చెప్పారు. కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టి ప్రజల‌లో అపోహలు నెలకొల్పి ప్రశాంత వాతావరణాన్ని టీడీపీ చెడగొట్టాలని చూస్తోందంటూ టీజేఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి బాలినేని ఆద్వర్యంలో జిల్లాలో సంక్షేమ పథకాలు అభివృద్ది బాటలో నడుస్తున్నాయని టీజేఆర్ చెప్పారు.

ycp mla tjr sudhaker babu comments

చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం లేక పోవడంతో రైతుల పాదయాత్రలోకి చొరబడి సానుబూతి పొందాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్ధానాలన్ని గతంలో నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాడన్నారు. చంద్రబాబు కుట్ర పూరిత రాజకీయాలను తిప్పికొట్టేందుకు సిఎం జగన్ ను కుర్చీపై పధిలంగా కూర్చో బెట్టేందుకు ఎంతటికైనా తెగించే కార్యకర్తలను తయారు చేస్తామ‌ని చెప్పారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని రాష్ట్రంలో చంద్రబాబు గొడవలు శృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపాలిటీ, పంచాయితీ ఎన్నికల్లో లబ్ది పొందాలనే భావనతో రైతుల పాదయాత్ర ముసుగులో చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version