ప్ర‌ధాని మోడీతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి భేటీ

-

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి స‌మావేశం అయ్యారు. పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్బంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి.. నేడు మ‌ధ్యాహ్నం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో స‌మావేశం అయ్యారు. ప్ర‌ధాన మంత్రిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎంపీ విజ‌య సాయి రెడ్డి.. ప్ర‌ధాని మోడీ స‌త్క‌రించారు. అనంత‌రం.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ విషయాన్ని వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు. ప్ర‌ధాన మంత్రి మోడీ ని స‌త్క‌రించిన ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లోని ప‌లు అంశాల‌ను ఈ స‌మావేశంలో ప్ర‌ధాని మోడీతో చ‌ర్చించాన‌ని ఎంపీ విజ‌య సాయి రెడ్డి ట్విట్ట‌ర్ లో తెలిపారు. అయితే ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో విద్యా రంగానికి రూ. ల‌క్ష కోట్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కేటాయించింది. కాగ విద్యా రంగానికి కేంద్ర ప్ర‌భుత్వం భారీ నిధులు కేటాయించ‌డంపై ప్ర‌ధానికి ఎంపీ విజ‌య సాయి రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version