BREAKING : వివేకా కేసులో సీబీఐ విచాణకు హాజరైన వైఎస్ భాస్కర్ రెడ్డి

-

వివేకా కేసులో మరో బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ వివేకా కేసులో కాసేపటి క్రితమే సీబీఐ విచాణకు హాజరయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఈ తరుణంలో భారీగా వైఎస్ భాస్కర్ రెడ్డి అనుచరులు రావడంతో జైలు వద్ద తోపులాట చోటు చేసుకుంది.

ఈ తరుణంలోనే… భాస్కర్ రెడ్డి కారు క్రింద కానిస్టేబుల్ పడ్డాడు. దీంతో వెంటనే అలర్ట్ కావడంతో ఆ కానీ స్టేబుల్‌ కు ప్రమాదం తప్పింది. సీబీఐ విచారణ సమయం పదింటికి కచ్చితంగా హాజరయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఇక భాస్కర్ రెడ్డి వెంట ఆయన లాయర్ కొండారెడ్డి కూడా హాజరయ్యారు.  ఇక ఈ సందర్భంగా మీడియాతో వైఎస్ భాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఎలాంటి విచారణకైనా నేను సిద్దంగా ఉన్నానని.. వైఎస్ వివేకా రాసిన లెటర్ చూస్తే.. అన్ని తేలుతాయని చెప్పారు వైఎస్ భాస్కర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version