టీవీ5, ABN యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి -ఎంపీ గోరంట్ల

-

ఏపీలో సంచలనం రేపిన అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై రాజకీయంగా దుమారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసు పై అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ రిపోర్టును విడుదల చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండవచ్చని ఎస్పీ తెలిపారు. వైరల్ గా మారిన ఈ వీడియో ఒరిజినల్ కాదని ప్రకటించారు.

అయితే.. ఈ వ్యవహారంపై ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌ మాట్లాడుతూ.. ఏబీఎన్‌, టీవీ5 టీడీపీని ఎంతగా లేపాలని చూసినా ఆ పార్టీ లేవదు. టీడీపీ నేతలకు కనీసం నైతిక విలువలు కూడా లేవు. టీవీ5, ఏబీఎన్‌ యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఓ ‍బ్రోకర్‌. నూటికి నూరు శాతం ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు. ఇది రాజకీయ కుట్ర. కొంత మంది దుర్మార్గులు చేసిన‌ పని ఇది. ఇది మార్ఫింగ్‌ చేసిన వీడియో అని ఆరోజే చెప్పానని గుర్తు చేశారు ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version