
వైసీపీ ఎంపీ వియజయసాయి రెడ్డి ట్వీట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. సీఎం జగన్ చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలుపడంలో ప్రతిపక్షాలు చేసే పొరపాట్లను ఎత్తిచూపడంలోను చాలా యాక్టివ్ గానే ఉంటారు. అయితే ఇప్పుడు ఆయాన ఓ ట్వీట్ చేశారు అందులో దేశ రాజధాని అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను తిట్టాడా..? లేక ఆంద్ర సీఎం జగన్ ను పొగిడాడా అర్థం అవ్వడం లేదు. ఆయన ట్వీట్ లో ‘’ఢిల్లీ వారైతేనే ట్రీట్మెంట్ ఇస్తామంటోది కేజ్రీవాల్ సర్కార్. రాష్ట్రం, ప్రాంతంతో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తోంది జగన్ గారి సర్కార్. 90 రోజుల్లో రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు PHC పూర్తిస్థాయి స్క్రీనింగ్ శాంపిల్ కలెక్షన్ చేపడుతూ దేశానికే ఆదర్శంగా ఉంది జగన్ ప్రభుత్వం అన్నారు. దీంతో నెటిజన్లకు ఆయన కేజృవాల్ కు కౌంటర్ వేశారా లేక జగన్ కు ప్రశంస చేశారా అనేది అర్థం అవ్వడం లేదు.
ఢిల్లీ వారైతేనే ట్రీట్మెంట్ ఇస్తామంటోది కేజ్రీవాల్ సర్కార్. రాష్ట్రం, ప్రాంతంతో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తోంది జగన్ గారి సర్కార్. 90 రోజుల్లో రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు PHC పూర్తిస్థాయి స్క్రీనింగ్ శాంపిల్ కలెక్షన్ చేపడుతూ దేశానికే ఆదర్శంగా జగనన్న ప్రభుత్వం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 29, 2020