చంద్రబాబు కోసం లోకేశ్ కూడా చేయలేని పని చేసిన వైకాపా కార్యకర్తలు !!

-

పైన టైటిల్ వాస్తవం. నారా లోకేష్ చేయని పని కూడా వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు కోసం చేస్తున్నారు. డీటెయిల్ గా విషయంలోకి వెళ్తే మూడు రాజధానులు లకు మరియు ఇంగ్లీష్ మీడియం వంటి పథకాలకు అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు మనసు మారాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి కార్యకర్తలు ప్రార్ధనలు చేస్తున్నారు. ఒక పథకం రాష్ట్ర అభివృద్ధి చెందితే మరొక పథకం పేదవాళ్ల బతుకులను మార్చే పథకం కాబట్టి చంద్రబాబు మనసు మారాలని రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కార్యకర్తలు భగవంతుని మొక్కుతున్నారు.

దీనిలో భాగంగా తాజాగా ఇటీవల మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మూడు రాజధానులకు చంద్రబాబు మద్దతు ఇవ్వాలని మంచి బుద్ధి రావాలి అని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు మాజీ పర్సనల్ అసిస్టెంట్ శ్రీనివాస్ దగ్గర ఉన్న రెండు వేల కోట్లు చంద్రబాబు చేసిన అవినీతి కి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నంతకాలం ప్రజల డబ్బును దోచుకున్నారని వాటినన్నిటినీ కేంద్ర ప్రభుత్వం వెలికితీయాలని కోరారు.

 

అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న వైయస్సార్ సిపి పార్టీ విద్యార్థి విభాగం నేతలు కార్యకర్తలు కూడా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తూ చంద్రబాబుకి మంచి బుద్ధి రావాలని కోరుకున్నారు.  మూడు రాజధానుల కు చంద్రబాబు మద్దతు చాలా మనసు మారాలని అంబేద్కర్ కి వినతి పత్రం అందజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version