జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆర్టీసీ గురువారం వెల్లడించింది. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ గట్టు దిగుతున్న క్రమంలో ఓ వ్యాన్ను ఢీకొటిన కంగారులో బ్రేకుకు బదులు ఎక్సలేటర్ని తొక్కడంతో బస్సు మరింత వేగం పెరిగిందన్నారు. వేగానికి తోడు కొండగట్టు మలుపులు.. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిందని ఆర్టీసీ అధికారులు నిర్థారించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 57 మరణించగా పాతికమందికి పైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారి మృత దేహాలను చెడిపోకుండా ఉండేందుకు ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై మృతుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన సంగతి తెలిసిందే.
కొండగట్టు బస్సు ప్రమాదానికి కారణం తెలుసా?
-
Previous article
Read more RELATEDRecommended to you
ఈరోజు సాయంత్రం 4-8 గంటల వరకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ...
నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి బయట పెడతా – కేశినేని చిన్ని
నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి బయట పెడతానని...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్...