జులై 30 నుంచి సూపర్​ లీగ్​ ప్రారంభం… ప్రకటన విడుదల చేసిన ఐసీసీ..!

-

2023 వన్డే ప్రపంచకప్‌ అర్హత కోసం ఈ ఏడాది జులై 30 నుంచి సూపర్​ లీగ్​ ప్రారంభంకానున్నట్లు ప్రకటించింది ఐసీసీ. తొలి మ్యాచ్​ ఇంగ్లాండ్​, ఐర్లాండ్​ మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. తొలిసారిగా నిర్వహిస్తున్న వన్డే ప్రపంచకప్​ సూపర్​ లీగ్​ జులై 30 నుంచి ప్రారంభంకానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. తొలి మ్యాచ్​ సౌంథాప్టన్​ వేదికగా ఇంగ్లాండ్​, ఐర్లాండ్​ మధ్య జరగనుంది. ఈ విషయాన్ని ఐసీసీ జనరల్​ మేనెేజర్​ జెఫ్​​ అల్లార్డైస్​ స్పష్టం చేశారు.

icc-cricket
icc-cricket

ఐసీసీ శాశ్వత సభ్యదేశాలైన 12 జట్లతో పాటు 2015-17 టోర్నీ విజేతైన నెదర్లాండ్​ ఈ సూపర్​ లీగ్​లో పాల్గొంటాయి. ప్రతి జట్టు స్వదేశంలో మూడు సిరీస్​లు, విదేశాల్లో మూడు సిరీస్​లు ఆడాల్సి ఉంటుంది.ఈ సూపర్​ లీగ్​ ద్వారా భారత్​లో జరిగే 2023 ప్రపంచకప్​ అర్హతకు నిర్ణయించనున్నారు. వన్డే ర్యాంకింగ్స్​లో తొలి 7 స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్​కు అర్హత సాధిస్తాయి. మిగిలిన టీమ్​ల అర్హత కోసం ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్​ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునట్లు తెలిపాడు ఇంగ్లాండ్​ జట్టు సారథి ఇయాన్​ మోర్గాన్.

Read more RELATED
Recommended to you

Latest news