బ్రేకింగ్: నిన్న సిఎంకు నేడు మాజీ సిఎంకు కరోనా

-

కర్ణాటక లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏకంగా సిఎం యడ్యురప్ప కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ రాష్ట్రంలో మరో కీలక నేత కూడా కరోనా బారిన పడ్డారు. ఆ రాష్ట్ర మాజీ సిఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి విషయం బయటపడ్డారు.

తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని చెప్పారు. తనను కలిసిన వారు అందరూ కూడా కరోనా పరిక్షలు చేయించుకోవాలి అని, వారు అందరూ హోం క్వారంటైన్ కి వెళ్ళాలి అని సిద్దు కోరారు. నిన్న ఆ రాష్ట్ర సిఎం యడ్యురప్ప కు కరోనా రాగా ఆయన వెంటనే కోలుకోవాలి అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news