ప్రజాదర్బార్ లో గవర్నర్…

-

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నూతన సంవత్సరం సందర్భంగా నేడు రాజ్ భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖలతో పాటు, సామాన్య ప్రజలు, చిన్నారులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ మిశ్రా, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహులు, హైదరాబాద్‌ సీపీ అంజన్‌ కుమార్‌, ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావులు పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది అందరి రాష్ట్రం అని.. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news