మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నందర్బార్ జిల్లా నర్మదా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. నదీమతల్లికి పూజలు చేసేందుకు వెళ్లి మంగళవారం 60 మందితో పడవ నదిలోకి వెళ్లిన క్రమంలో భూషణ్గావ్ గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి 36 మందిని కాపాడిన స్థానికులు ఆస్పత్రిలో చేర్పించినట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారంతా సమీప గ్రామాలకు చెందిన గిరిజనులుగా గుర్తించారు. సామర్థ్యం మించి పడవలో ప్రయాణీకులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాధమికంగా వెల్లడైందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో తప్పిపోయినవారిని నదిలో గాలిస్తున్నారు. పండుగ వేళ ఇలాంటి ఘటన జరగడంతో ఆ గ్రామంలో విషాద చాయలు అమలుకున్నాయి.
పండుగ రోజు పూజకోసం వెళ్లి…
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వాహనదారులకు షాక్.. ఆ వాహనాలకు రూ.10వేల ఫైన్..!
వాహనదారులకు భారీ షాకింగ్ వార్త. రవాణా వాహనాల యజమానులు, డ్రైవర్లకు ఇక...
Anji N -
క్వింటా కి రూ.500 ఇచ్చేంత వరకు రేవంత్ సర్కార్ నీ వదిలి పెట్టేది లేదు : కేటీఆర్
నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందాలో, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ లోనూ...
Anji N -
అత్యధిక పోలింగ్ నమోదైన నియోజకవర్గం ఇదే..!
ఆంధ్రప్రదేశ్ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన విషయం...
Anji N -