రాంకీ గ్రూప్ కు షాక్‌..రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటన !

-

ప్రముఖ రాంకీ గ్రూప్‌ సంస్థకు షాక్‌ తగిలింది. రంగారెడ్డి జిల్లాలో రాంకీ గ్రూప్‌ చేపట్టిన జాయింట్‌ ఇంటిగ్రేడెట్‌ టౌన్‌ షిప్‌ లోని ఫ్లాట్లు, విల్లాల రిజిస్ట్రేషన్‌ ను ఉన్న పలంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ హై కోర్టుకు తెలిపింది హెచ్‌ఎండీఏ. తమకు ఇవ్వాల్సిన డబ్బును చెల్లించకపోవడంతో… ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

అలాగే.. వారి టౌన్‌ షిప్‌ లోని ఫ్లాట్ల యాజమాన్య హక్కులపై రాంకీ గ్రూప్‌ తప్పుడు సమాచారం ఇచ్చిందని.. దాని వల్ల కొనుగోలుదారులు మోసపోతారనే ఉద్దేశ్యంతో రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది హెచ్‌ఎండీఏ. రంగారెడ్డి జిల్లాలోని.. శ్రీనగర్ గ్రామంలో 14 ఏళ్ల కిందట డిస్కవరీ సిటీ పేరుతో రాంకీ సంస్థ ఆ ప్రాజెక్టు చేపట్టింది. టౌన్ షిప్ ను అభివృద్ధి చేయడం కోసం హెచ్ఎండీఏతో ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంగించడంతో… రాంకీ సంస్థకు చెందిన ప్లాట్లు, విల్లాల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీని ఆదేశించింది హెచ్‌ఎండీఏ. అయితే.. దీనిపై రాంకీ సంస్థ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై గత నెల 31న హైకోర్టులో హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బి.లక్ష్మీ నరసింహారెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు.

డెవలప్ మెంట్ ప్రీమియం కింద రాంకీ గ్రూప్‌… హెచ్ఎండీఏకు రూ.100 కోట్లు చెల్లించాలి…రూ.25 కోట్లు మాత్రమే చెల్లించింది. ప్రతిపాదిత టౌన్ షిప్ కోసం చూపించిన 374 ఎకరాల భూముల్లో ఏకంగా.. 130 ఎకరాల భూమిపై ఆ సంస్థకు హక్కులు లేవని తేలిందని ఆయన అఫిడవిట్‌ లో వెల్లడించారు. అందుకే ఈ ప్రాజెక్టు నిలిపివేయాలని టెర్మినేషన్ నోటీసు ఇచ్చామన్నారు. రాంకీ సంస్థ సమాధానం సరిగా లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు. అటు రాంకీ సంస్థ.. పిటిషన్ కొట్టివేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్.. తదుపరి విచారణను ఈనెల 7కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news