2022 అనారోగ్య సమస్యలను తెలిపిన స్టార్స్ వీళ్లే..!!

-

తెలుగు సినీ పరిశ్రమ కూడా ఈ మధ్యకాలంలో మంచి పాపులారిటీ సంపాదిస్తోంది.ముఖ్యంగా ఇందులో ఉండే నటీనటులు సైతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో నటించడంతో మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే గతంలో ఎక్కువగా హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే తమ అనారోగ్య సమస్యల గురించి చాలా ధైర్యంగా చెప్పేవారు. కానీ గడిచిన కొంతకాలం నుంచి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉండడం జరుగుతోంది. ఈ ఏడాది తమ అనారోగ్య సమస్యల గురించి తెలియజేసిన వారి గురించి తెలుసుకుందాం.

1). సమంత:

ఈ ఏడాది అక్టోబర్ నెలలో సమంతకు మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా ఇన్స్టాగ్రామ్ లో తెలియజేసింది. ఇది కండరాల బలహీనతకు సంబంధించిన వ్యాధి.

2). ఫాతిమా సనా షేక్:

దంగల్ సినిమాతో వెలుగులోకి వచ్చిన ఈమె మూర్చ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

3). యామి గౌతమ్:

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె పలు చిత్రాలలో నటించింది. ఈమె కూడా చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది.

4). వరుణ్ ధావన్:
బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ కూడా తన అనారోగ్య సమస్యల గురించి తెలియజేశారు. తను స్టిబ్యులర్ హైఫో ఫంక్షన్ తో బాధపడుతున్నట్లుగా చెప్పి ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యపరిచారు.

5). డైరెక్టర్ అనుదీప్:
జాతి రత్నాలు సినిమాతో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాను ది కూడా హైలీ సెన్సిటివ్ పర్సన్ అనే వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు.

ఇక వీరే కాకుండా నటి కల్పిక మరి కొంతమంది కూడా తమకు సంబంధించిన అనారోగ్య సమస్యలను తెలియజేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news