పాల డెయిరీ ‘కంట్రీ డిలైట్‌’ మోసం బట్టబయలు..నోటీసులు జారీ !

-

కంట్రీ డిలైట్ కంత్రి మాయా వెలుగులోకి వచ్చింది. అనుమతులు లేకుండానే తెలంగాణ రాష్ట్రంలోనే నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు జరుపుతోంది కంట్రీ డిలైట్‌. ఈ తరుణంలోనే..యథేచ్ఛగా కోట్లలో వ్యాపారం చేస్తున్న కంట్రీ డిలైట్‌ ఆట కట్టించింది తెలంగాణ ఫుడ్ ఇన్స్పెక్టర్స్. సంగారెడ్డి లోని ప్లాంట్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తరుణంలోనే తెలంగాణలో FASSAI అనుమతులు తీసుకోలేదని వెల్లడించారు అధికారులు. 52 లక్షల విలువ చేసే1500 లీటర్ల నెయ్యి సీజ్ చేశారు అధికారులు. అంతేకాదు… కంట్రీ డిలైట్ కు నోటీసులు జారీ చేసింది తెలంగాణ ఆహార నాణ్యత ప్రమాణాల విభాగం. ఫార్మ్ టు హోమ్ అంటూ స్టోర్ చేసిన నెయ్యిని వినియోగదారులకు అందిస్తున్న కంట్రీ డిలైట్… ఫార్మ్ టు హోమ్ అంటూ.. తప్పుడు ప్రచారం చేస్తోందని అధికారులు గుర్తించారు. మిస్ బ్రాండింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన కంట్రీ డిలైట్ కు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news