రేపు ఉ.11.30 గంటలకు.. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం

-

ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం రేపు ఉదయం 11:30 కు జరుగుతుందని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈరోజు బాలానగర్ నుంచి భారీ ట్రాలీ ఖైరతాబాద్ చేరుకోనుంది. అర్ధరాత్రి 12 గంటలకు చివరి పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఒంటిగంట తర్వాత గణపతిని కదిలించనున్నారు.

Khairatabad Ganapati Shobhayatra
Khairatabad Ganapati Shobhayatra

రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై… టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా సాగుతుంది. ఉదయం 10:30 గంటలకు క్రేన్ నెంబర్ 4 వద్ద పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, హైదరాబాద్‌ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది.అర్ధరాత్రి 2 గంటల వరకూ మెట్రో సేవలు అందించనున్నట్లు మెట్రో ప్రకటన చేసింది. వినాయక నిమజ్జనం ఉన్న నేపథ్యంలోనే మెట్రో ఈ ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news