సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ నిర్మాత మృతి

-

తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాస్తవానికి ఇవాళ ఉదయం సీనియర్ హీరో, నటుడు చంద్రమోహన్ అనారోగ్యం బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ విషయం జరిగి కొద్ది గంటల వ్యవధిలోనే తాజాగా ఓ నిర్మాత కూడా కన్నుమూశాడు. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంత ఊరు, గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఓ రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత యక్కలి రవీంద్ర బాబు హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం తుది శ్వాస విడిచినట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో పుట్టి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని చార్టర్ట్ ఇంజనీర్ గా తన సేవలు అందిస్తూనే తనకు సినిమా పట్ల ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారి దాదాపు 17 సినిమాలు నిర్మించి పలు అవార్డులు పొందారు యక్కలి రవీంద్రబాబు. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో కూడా సినిమాలు నిర్మించారు యక్కలి రవీంద్ర బాబు. యక్కలి రవీంద్ర బాబుకి భార్య రమాదేవి, ఇద్దరూ పిల్లలున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news