BREAKING : ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదట ప్రారంభం అయింది. తెలంగాణ వ్యాప్తంగా 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

కాగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మొత్తం 49 కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలోని 35,655 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news