మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కోసం పోలీసుల గాలింపు

-

హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం నారాయణపేట జిల్లా కోస్గి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బోరబండ పోలీసులతో సాయంతో రెండు రోజుల నుంచి గాలింపు కొనసాగిస్తున్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా బాబా ఫసీయుద్దీన్కు నారాయణపేట జిల్లా బాధ్యతలను బీఆర్ఎస్ పార్టీ అప్పగించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే చంపేస్తామంటూ ఫసియుద్దీన్ బెదిరించి దాడి చేశారని, అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఫిర్యాదు మేరుకు మరో 9 మంది పైన కేసు నమోదు చేశారు. కొండల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎం.రాజేష్, వెంకట నర్సింలు, కోనేరు సాయప్ప, బాలేష్, హితేష్, రాజేందర్ రెడ్డి, అమీర్ షేక్, బాబా ఫసియుద్దీన్లపైన కోస్గి పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసులో భాగంగా బాబా ఫసియుద్దీన్ కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news