Guntur Kaaram: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్.. భారీగానే అరేంజ్మెంట్స్..!

-

ఈసారి మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో ఉంది. ఈ సినిమా మీద మహేష్ బాబు ఫ్యాన్స్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కచ్చితంగా సినిమా హిట్ అవుతుందని బాగా ఎంజాయ్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ సినిమాని నిర్మిస్తున్నారు.

ఆదివారం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు దాంతో హైప్ మరింత పెరిగింది. కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాటు కూడా చక చక సాగుతున్నాయి. ఈనెల తొమ్మిదవ తేదీన గుంటూరులో ఫ్రీ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. మొదట హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని అనుకున్నారు కానీ సాధ్యపడలేదు దీంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గుంటూరు కి మార్చారు ఈనెల 9వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం మొదలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news