IND VS ENG : నేటి నుంచి విశాఖ టెస్ట్..జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య ఇవాల్టి నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం లో జరుగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు… ఈ మ్యాచ్ లో కూడా తన పట్టు కొనసాగించాలని ప్లాన్ వేస్తోంది.

India vs England, 2nd Test

అటు సొంత గడ్డపై… విజృంభించి మళ్లీ దాడిలో పడేందుకు టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య జరగనున్న రెండవ టెస్టు మ్యాచ్ ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియాలో మూడు మార్పులు కనిపించే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటికే విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అటు మహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news