పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారు: ఎంపీ కేకే

-

భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశంలోనే అత్యున్నత పురస్కారం ఇచ్చి తెలంగాణ ముద్దుబిడ్డను గౌరవించింది. పీవీకి ఈ పురస్కారం దక్కడం పట్ల రాజకీయాలకతీతంగా పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

 

పీవీ నరసింహారావుకు భారతరత్న దక్కడం పట్ల రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు స్పందించారు. ఆయనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని తమ పార్టీ కేంద్రాన్ని పలుమార్లు కోరిందని వెల్లడించారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని దేశ ప్రజలంతా హర్షిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

మరోవైపు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. పీవీకి దక్కిన పురస్కారం రాష్ట్ర ప్రజలకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్‌ చేసిందని గుర్తు చేశారు. తమ డిమాండ్‌ను గౌరవించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news