పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది: బండి సంజయ్ కుమార్

-

తెలుగు ప్రజలకు ప్రత్యేకించి తెలంగాణకు దక్కిన గౌరవమిది అని బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముద్దు బిడ్డకు అత్యున్నత పురస్కారం లభించడం ఆ జిల్లావాసిగా గర్వపడుతున్నా అని అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఎంతో సేవ చేసిన పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది అన్నారు.

పీవీని కేవలం రాజకీయ లబ్దికే వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది అని అన్నారు. పీవీ చేసిన సేవలను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారం అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదములు అని అన్నారాయన. మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ లకు భారతరత్న పురస్కారం సముచిత నిర్ణయమని బండి సంజయ్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news