కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని కొరికిన ఎలుకలు

-

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని కొరికాయి ఎలుకలు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుక కరిచిన ఘటన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి జరిగింది. కామారెడ్డికి చెందిన షేక్ ముజీబ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి రోగులందరూ నిద్రలోకి జారుకున్నాక ఎలుకలు ఆసుపత్రిలో సంచరించాయి.

Rats bit a patient in Kamareddy Government Hospital

ఎలుక కరవడంతో ముజీబ్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి సంఘటన గతంలో వరంగల్ లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటన పై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news