ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన సుధామూర్తి

-

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి స్పందించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. నన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. మన దేశానికి సేవ చేసే అవకాశమిచ్చిన మీకు రుణపడి ఉంటా’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. దీనికి ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్న సూక్తిని ఆమె జత చేశారు.

కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో ఆమెను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో ఆమె చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. ఆమె రాజ్యసభకు నామినేట్‌ అవడం ‘నారీశక్తి’కి బలమైన నిదర్శనమని మోడీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news