సలార్ 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన కేరళ నటుడు పృథ్వీరాజ్

-

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది.దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను వసూలు చేసింది.అయితే ‘సలార్’ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ‘సలార్-2’ షూటింగ్పై వరదరాజ మన్నార్ పాత్రలో మెరిసిన మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. ‘సలార్-2’ మూవీ షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుందని ఆయన రీసెంట్ గా నటించిన ‘ది గోట్’ మూవీ ప్రమోషన్స్లో చెప్పారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలవుతుందని ఇప్పటికే నటుడు బాబీ సింహా సైతం చెప్పిన సంగతి తెలిసిందే.

 

ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించింది. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరి కుమారి , శ్రీయ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలలో నటించారు.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు.రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news