రేవంత్ న్యాయం చేస్తారు.. నమ్మకం వుంది: రేణుక చౌదరి

-

సీఎం రేవంత్ రెడ్డి కమ్మలకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని రాజ్యసభ ఎంపీ రేణుక చౌదరి అన్నారు. అన్ని కులాలని కలుపుకుని పోయేది కమ్మ సామాజిక వర్గం అని అన్నారు తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారకరామారావుని చాలా మంది తనని ఎన్టీఆర్ కూతురు అనుకునేవారని అన్నారు. కమ్మవారిలో రైతు కూలీలు ఉన్నారని అన్నారు.

కమ్మవారికి కరువు సమయంలో కార్పొరేషన్ అవసరమని అన్నారు రేణుక. మనం పోయాక విగ్రహాలు ముఖ్యం కాదు మనం తీర్చిదిద్దే జీవితాలు శాశ్వతం అని అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమ్మ ద్వేషి రాష్ట్రం ఏలుతూ ఉత్తమ పక్కన వారితో కమ్మలని తెప్పించే పరిస్థితి ఎందుకు వచ్చిందని మండిపడ్డారు పౌరుషం పట్టుదల ఉన్న సామాజిక వర్గం మనది అని అన్నారు బీఆర్ఎస్ అధినేత కూడా తన కొడుకుకి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news