రేవంత్ రెడ్డి పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

-

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతోంది అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఈ రోజు ఆయన మీడియా తో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాల్సిన కర్మ తమకి పట్టలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మీరే ప్రభుత్వాన్ని కూల్చుకుంటున్నారని అన్నారు.

ఐదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్ష పార్టీగా వెంటాడుతామని అన్నారు కేసులు తప్పించుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బిజెపిలో చేరుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రి అని సెటైర్ కూడా వేశారు ఇద్దరు కలిసి తెలంగాణని ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news