IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో గ్రాండ్ విక్టరీ

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో నిన్న కీలక మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య 39వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది.

Lucknow Super Giants won by 6 wkts

ఈ మ్యాచ్లో రుద్రాజ్ గైక్వాడ్ సెంచరీ చేయగా శివం దూబే 66 పరుగులు చేసి రాణించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెంట్స్ 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది. లక్నో ఆల్రౌండర్ మర్కస్ స్టోయిన్స్ సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించాడు. దీంతో అతనికి మాన్ అఫ్ ద మ్యాచ్ వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news