అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలి.. హరీష్ రావు డిమాండ్

-

నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో సన్నవడ్లకు మాత్రమే రూపాయలు 500 బోనస్ ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రకటనపై బిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు తాజాగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని ,కొనుగోలు కేంద్రాల్లో లారీ డ్రైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని మండిపడ్డారు.

దీంతో వారు వడ్ల రవాణాకు కూడా ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. తడిసిన ధాన్యానికి మొలకలు రాక ముందే కొనుగోలు చేయాలని ,రైతులకు జీలుగు, జనుము విత్తనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పండించిన అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని,అదేవిధంగా వడ్లతో పాటు మిగతా పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతుబంధు జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news