వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై జగన్‌ సంచలన పోస్ట్‌ !

-

Jagan’s sensational post on YS Rajasekhar Reddy: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపై మాజీ సీఎం జగన్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు అంటూ ఎమోషనల్‌ అయ్యారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారన్నారు.

Jagan’s sensational post on YS Rajasekhar Reddy

ప్రజా శ్రేయస్సుకోసం మీరు చూపిన మార్గం మాకు శిరో ధార్యం.జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గమని తెలిపారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరివరకూ మా కృషి అని తెలిపారు మాజీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news