టీడీపీలో గెలిచిన తలసానిని కెసిఆర్ ఎందుకు పార్టీలోకి తీసుకున్నాడు : బీజేపీ ఎంపీ

-

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఅర్ చేసిన రాజకీయ దారిద్య్రాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని మండిపడ్డారు.గజ్వేల్ పట్టణంలో బీజేపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను భ్రష్టు పట్టించిన , రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేసిన బావ బామ్మర్దులు ఇద్దరు కలిసి ఢిల్లీలో సమావేశం పెట్టారు.సిరిసిల్ల ఎమ్మెల్యే నేషనల్ మీడియా ముందు సన్నాయి నొక్కుతుండు అని విమర్శించారు.

సైకిల్ గుర్తు మీద గెలిచిన తలసానినీ ఏ రాజ్యాంగం ప్రకారం బీఆర్ఎస్ పార్టీలో తీసుకొని కేసీఆర్ ఎలా మంత్రినీ చేశారు అని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలని హరీష్‌రావు అంటుండు. సిగ్గులేకుండా ఇదే గజ్వేల్లో రూ.100 ఖర్చు పెట్టీ, ఓటుకు రూ.1000 పంచిన ఆయన ఢిల్లీ పోయి మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన దరిద్రం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news