డీఎస్సీ వాయిదా పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.. బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ఫైర్

-

కేసీఆర్ ఫ్యామీలీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విద్యార్థుల చావుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. డీఎస్సీ వాయిదా పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు సీఎం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కేసీఆర్ 10 సంవత్సరాలలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ వేసింది లేదని విమర్శించారు. యువకులు మధ్యవయస్కులుగా మారిపోయారు అని అన్నారు. కోచింగ్ సెంటర్లను వెంటేసుకుని కేసీఆర్ హరీష్ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. తాము 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.4 రోజులుగా కేటీఆర్, హరీష్ రావు మోదీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. పరీక్షలు వాయిదా వేస్తే పేద నిరుద్యోగులు నష్టపోతారని రేవంత్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news