Telangana: ప్రేమ పేరుతో యువతిని వేధించిన ఇద్దరు యువకులు..చివరికీ !

-

ప్రేమ పేరుతో యువతిని వేధించారు ఇద్దరు యువకులు. దీంతో ఆ బాధిత యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో కల్యాణి(19) అనే యువతిని అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నారు.

Two young men harassed a young woman in the name of love The young woman committed sicide

ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి కల్యాణికి సదరు యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో విరక్తి చెందిన కల్యాణి పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది.. స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news