వరంగల్ లో దారుణం.. తల్లికి చీమలు పట్టినా పట్టించుకోని కొడుకులు

-

వరంగల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తల్లికి చీమలు పట్టినా పట్టించుకోవడం  కొడుకులు.  వరంగల్ జిల్లా నెక్కొండ లో వెలుగు చూసింది ఈ దారుణం. చిన్నతనంలో పిల్లలను తల్లిదండ్రులు అల్లరు ముద్దుగా పెంచి పోషిస్తారు. వారు పెద్దయ్యే సరికి తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకుంటారు. ఆ వయస్సులో తల్లిదండ్రులకు తోడుగా ఉండాల్సిన పిల్లలు, శత్రువులుగా మారుతున్నారు. నవ మాసాలు మోసి, కనిపెంచిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూడాల్సిన కుమారులు ఇలా వదిలేశారు.

వరంగల్ జిల్లా నెక్కొండలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.  చూసిన వారికి అయ్యో పాపం అనిపించక మానదు.  కొమరమ్మ(73) ఇటీవల కింద పడి గాయల పాలయ్యింది. ఇద్దరు కుమారులు ఆసుపత్రి లో చేర్చి చికిత్స పూర్తి కాకముందే ఆ తల్లిని ఇంట్లో వొదిలేసి వెళ్ళిపోయారు. నిస్సహాయత స్థితిలో పడి ఉన్న కొమరమ్మ గాయాన్ని చీమలు, దోమలు పీక్కు తింటున్నాయి. ఇది చూసిన గ్రామస్థులు.. మీరేం మనుషులు రా బాబు.. అంటూ  మీడియాకి సమాచారం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news