గంజాయి అమ్ముతు పట్టుబడ్డ ఐఐటీ విద్యార్థి..!

-

ఐఐటి చదివి గంజాయి అమ్ముతున్న పవన్ అనే విద్యార్థిని అరెస్ట్ చేసారు పోలీసులు. ఎస్సార్ నగర్ లోని పీజీ హాస్టల్లో ఉంటూ గంజాయి అమ్మకాలు చేస్తున్నాడు. ఐఐటీ విద్యార్థితో పాటు ఐటీ ఉద్యోగిని కూడా అరెస్ట్ చేసారు ఎక్సైజ్ అధికారులు. పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ పోలీసులు దాడులు చేసారు. మణికొండ కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మణికొండలో ఐటీ ఉద్యోగి లోకేష్ ఇంట్లో 1.75 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

లోకేష్ కు గంజాయి అమ్మిన శ్రీకాంత్ అనే వ్యక్తిని కూకట్పల్లిలో పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. గంజాయికి బానిసగా మారాడు ఐటీ ఉద్యోగి లోకేష్. ఎస్ఆర్ నగర్ పిజి హాస్టల్ లోనూ ఎక్సైజ్ STF పోలీసులు తనిఖీలు చేసారు. ఐఐటీ విద్యార్థి పవన్ గదిలో 1.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అయితే కిలో గంజాయిని 20 వేలకు అమ్ముతున్నారు నిందితులు. వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసిన 22 మందిని గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు.. వారందరి పైన కేసులు నమోదు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news