పాత సెక్రటేరియట్ ను కూల్చి..BRS నేతలే గుప్త నిధులు ఎత్తుకెళ్లారు – మైనంపల్లి

-

పాత సెక్రటేరియట్ ను కూల్చి..BRS నేతలే గుప్త నిధులు ఎత్తుకెళ్లారనే అంశం తెరపైకి వచ్చిందని బాంబ్‌ పేల్చారు మైనంపల్లి హనుమంతరావు. ఇవాళ మెదక్‌ లో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ… ప్రభుత్వం పోగానే తెలంగాణ, ఆంద్ర అంటూ చిచ్చు పెడుతున్నారని ఆగ్రహించారు. సెక్రటేరియట్ ను కూల్చి BRS వాళ్ళు నిధులు ఎత్తుకెళ్లారు అన్న ప్రచారం ఉందన్నారు మైనంపల్లి హనుమంతరావు.

Sensational comments of former MLA Mynampally Hanumantha Rao in Narsapur

ఈ రోజు మీరు కట్టిన సెక్రటేరియట్ లో అన్ని లీకులు అవుతున్నాయని ఆరోపణలు చేశారు. BRS వాళ్ళవి క్రిమినల్ మైండ్ లు… విద్యుత్ అధికారులు కొందరు BRS వాళ్ళకి సహకరిస్తున్నారని మండిపడ్డారు. BRS మీటింగ్ లకి వాళ్లే కావాలని కరెంట్ కట్ చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ రేపటి నుంచి నీకు ఉంటుంది ఇక కాసుకో బిడ్డా…. అంటూ హెచ్చరించారు. కొండగట్టు లో బస్సు ప్రమాదం, మాసాయిపేట ఘోర రైలు ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ఆగ్రహించారు మైనంపల్లి హనుమంతరావు.

Read more RELATED
Recommended to you

Latest news