తిరుమల లడ్డూపై విశ్వహిందూ పరిషత్ సంచలన ప్రకటన !

-

తిరుమల లడ్డూపై విశ్వహిందూ పరిషత్ సంచలన ప్రకటన చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది విశ్వహిందూ పరిషత్. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఘటనను విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది అని తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ అధ్యక్షలు నరసింహ చెప్పడం జరిగింది. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ అధ్యక్షలు నరసింహ.

Vishwa Hindu Parishad sensational announcement on Tirumala Laddu

ఇందులో భాగంగానే ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని విశ్వహిందూ పరిషత్ అధ్యక్షలు నరసింహ వెల్లడించారు. నిరసన కార్యక్రమం అనంతరం అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా హిందూ బంధువులందరూ హాజరై వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ అధ్యక్షలు నరసింహ.

Read more RELATED
Recommended to you

Latest news