రెచ్చిపోయిన మందుబాబులు.. ఆలయ కమిటీ మెంబర్స్‌పై బాటిల్స్‌తో దాడి

-

ఆలయ ప్రాంగణంలో మద్యం ఎందుకు సేవిస్తున్నారని ప్రశ్నించినందుకు గాను టెంపుల్ కమిటీ మెంబర్స్‌పై మందు బాటిళ్లతో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఉప్పలగూడలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద చింతల్ బస్తీకి చెందిన కొందరు కూర్చొని మందు తాగుతున్నారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ మద్యం తాగొద్దని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు.


దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మందుబాబులు తాగొద్దని చెప్పేందుకు మీరెవరంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. నిందితుల దాడిలో ఉప్పలగూడకు చెందిన జి.శ్రీనివాస్,బి.కిరణ్,రాములు,గోపాల్,షేక్‌పేట్ చెందిన శ్రీనివాసులు గాయపడ్డారు. గతంలోనూ అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసరాల్లో మద్యం, మత్తు పానీయాలు సేవించిన దాఖలు అనేకం ఉన్నాయి. తాజా ఘటన నేపథ్యంలో ఇటువంటివి మరోసారి జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news