కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు..10 మందికి గాయాలు

-

స్కూల్ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఖమ్మం రూరల్ డోర్నకల్‌లోని మిర్యాలగూడెం మండల పరిధిలోని అవంతిపురంలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం..పాఠశాలకు సమయం అవుతుందని విద్యార్థులను తీసుకెళ్తుండగా బస్సు అతివేగంతో వెళ్లడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది.అనుకోకుండా జరిగిన ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన చిన్నారులకు చికిత్స అందించేందుకు మిర్యాలగూడ ప్రభుత్ప ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news