వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సర్కార్ : కేటీఆర్

-

తెలంగాణలో దసరా పండుగ వేళ కాంగ్రెస్ సర్కారు వ్యవసాయాన్ని దండగలా మార్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓవైపు సాగునీటి సంక్షోభం, ఇంకోవైపు రైతుభరోసా మోసంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ రేవంత్ సర్కారును ప్రశ్నించారు. ‘పొలం ఉన్న రైతులనూ పొట్టన బెట్టుకుంటున్నారని, కౌలు తీసుకున్న కర్షకులనూ కబళిస్తున్నారని మండిపడ్డారు.ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే కారణమని అన్నారు.ఓవైపు సాగునీటి సంక్షోభం..మరోవైపు రుణమాఫీ ద్రోహం..ఇంకోవైపు రైతుభరోసా మోసం..కౌలు రైతులకూ అందని సాయం అని విమర్శలు చేశారు.

రైతులకు రక్షణ వలయంగా ఉన్న పథకాలను ఒక్కొక్కటిగా ఎగ్గొట్టడంతోనే వ్యవసాయంలో ఈ విలయం వచ్చిందన్నారు. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదని, ముఖ్యమంత్రికి సోయి, ప్రభుత్వానికి బాధ్యత లేవని పలు ఆరోపణలు చేశారు. ఇక దసరా పండుగ వేళ..వ్యవసాయాన్ని దండుగలా మార్చిన సీఎం రేవంత్ కు రైతన్నల చేతిలో దండన తప్పదన్నారు.అన్నదాతలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ముంచే రోజులు పోయి,మళ్లీ మంచిరోజులొస్తాయని కేటీఆర్ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news