చెత్తపన్నుపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

-

ఏపీ ప్రభుత్వ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న ఈ మీటింగులో అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.అదేవిధంగా మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.దీనికి తోడు మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించిన చెత్త పన్ను రద్దుపై కూడా మంత్రి వర్గంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

అయితే, సీఎం చంద్రబాబు ముందుగా ముంబై వెళ్లి రతన్ టాటాకు నివాళి అర్పించాలని భావించారు. ఆ తర్వాత సాయంత్రానికి తిరిగి వచ్చి కేబినెట్ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. కానీ, ముంబై విమానాశ్రయాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఫ్లైట్ డిలే అవుతున్నట్లు అధికారుల నుంచి చంద్రబాబుకు సమాచారం రాగా.. ముందుగా కేబినెట్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత ముంబై వెళ్లాలని అనుకున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news