ఎన్సీపీ ఎమ్మెల్యే దారుణ హత్య..రెండ్రోజుల్లో లెక్కతేలుస్తాం : అజిత్ పవార్

-

నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఎమ్మెల్యే సిద్దికీని శనివారం గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. ద్దికి మరణం చాలా బాధాకరణమని, సీనియర్ లీడర్‌ని కోల్పోవడం తమ పార్టీకి తీరని లోటన్నారు.‘పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం ఐదు బృందాలు వెతుకుతున్నాయి.రెండు రోజుల్లో హత్య కుట్రదారులను గుర్తిస్తాం. దీనిపై హోం మినిస్టర్ కూడా సీరియస్‌గా ఉన్నారు.అతి త్వరలో ఈ కేసును ఛేదిస్తాం’ అని పేర్కొన్నారు.

పోస్టుమార్టం నిమిత్తం సిద్దికీ మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఆఖరి చూపు కోసం కాసేపు అక్కడ ఉంచనున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలకు ముంబైలోని బడా కబరిస్తాన్‌లో అధికారిక లాంఛనాలతో సిద్దికి అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, సిద్దికీతో సన్నిహితంగా ఉండే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు.

 

Read more RELATED
Recommended to you

Latest news